కొత్తగా మరో 245 కేసులు, ఒకరు మృతి

by  |
కొత్తగా మరో 245 కేసులు, ఒకరు మృతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో కొత్తగా మరో 245 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 6,52,380 కు చేరుకోగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 6,41,270కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో52, కరీంనగర్ లో 30 తేలగా, ఆదిలాబాద్ లో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 4, జగిత్యాలలో 7, జనగామ 3, భూపాలపల్లిలో 4, గద్వాలలో 2, ఖమ్మంలో 7, ఆసిఫాబాద్ లో 1, మహబూబ్ నగర్ లో 5, మహబూబాబాద్ లో 4, మంచిర్యాల 9, మెదక్ లో 1, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 10, ములుగులో 4 నల్లగొండలో 17, నారాయణపేట్ 1, నిర్మల్ 1, నిజామాబాద్ 5, పెద్దపల్లి 10, సిరిసిల్లా 4, రంగారెడ్డి 16, సంగారెడ్డి 1, సిద్ధిపేట్ 5, సూర్యాపేట 8, వికారాబాద్ 2, వనపర్తి 1, వరంగల్ రూరల్ 14, హన్మకొండలో 15 కేసులు తేలాయి.

కానీ కామారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా రికార్డు కాలేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆక్టీవ్ కేసుల సంఖ్య 7,268కి చేరగా వీరిలో 95 శాతం మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.


Next Story