కివీస్‌కు మరో షాక్.. టీ20కి మార్టిన్ గప్టిల్ దూరం..?

by  |
కివీస్‌కు మరో షాక్.. టీ20కి మార్టిన్ గప్టిల్ దూరం..?
X

దిశ, వెబ్‌డెస్క్: T20 ప్రపంచకప్‌ 2021 టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన న్యూజీలాండ్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ లుకీ ఫెర్గూసన్ ఈ మెగా టోర్నీకి దూరం కాగా.. మరో స్టార్ ఓపెనర్‌కు గాయం అయింది. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ గాయపడ్డాడు. కివీస్‌‌ ఇన్నింగ్స్‌లో 5వ ఓవర్‌ వేసిన పాక్ పేసర్ హరీస్ రౌఫ్ .. రెండో బంతికే గప్టిల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే రౌఫ్ వేసిన బంతి నేరుగా గప్టిల్‌ కాలికి తగిలి వికెట్లను తాకింది. ఈ క్రమంలో గప్టిల్‌ బొటన వేలుకు గాయమైంది. ప్రస్తుతం ఆ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. దీంతో అతడు ఆదివారం టీమిండియాతో జరిగే మ్యాచ్‎లో ఆడకపోవచ్చని సమాచారం. ఇదే జరిగితే కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగిలినట్టే.

ప్రస్తుతం గప్టిల్‌ను స్కానింగ్‎ కోసం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, గాయానికి సంబంధించిన పూర్తి సమాచారం 24 నుంచి 48 గంటలు తర్వాత చెబుతామని హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు.

ఇక నుంచి భారత్, కివీస్ జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే కానుంది. ఈ సమయంలో మార్టిన్ గప్టిల్ గాయం కివీస్ జట్టులో ఆందోళన కలిగిస్తోంది. టీమిండియాతో జరిగే మ్యాచుకు అతడు దూరమైతే కేన్ సేనకు భారీ షాక్ తప్పదు. ఒకవేళ గప్టిల్ దూరమయితే పాక్ మ్యాచులో దారుణంగా విఫలమయిన భారత బౌలర్లకు శుభసూచికమనే చెప్పొచ్చు.

Next Story