టీ20 వరల్డ్ కప్: నమీబియాపై న్యూజీలాండ్ ఘన విజయం

by  |
టీ20 వరల్డ్ కప్: నమీబియాపై న్యూజీలాండ్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా షార్జా స్టేడియం వేదికగా జరుగుతున్న నమీబియా-న్యూజీలాండ్‌ మ్యాచ్‌లో.. కివీస్ జట్టు 52 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నమిబీయాలో బౌలర్లు తొలుత కట్టడి చేసినా.. చివర్లో అనవసర పరుగులు సమర్పించుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి న్యూజీలాండ్ 163 పరుగులు చేసింది. ఓపెనర్లు మర్టిన్ గప్తిల్ (18), మిచేల్ (19), విలియమ్సన్ (28), కాన్వే (17) పరుగులు చేసి వెనుదిరిగారు. కానీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్‌లు ఫిలిప్స్ (39 నాటౌట్), జేమ్స్ నీషమ్ (35 నాటౌట్‌)గా నిలిచి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో న్యూజీలాండ్ 163/4 స్కోరు నమోదు చేసింది.

ఇక చిన్న జట్టు అయినా నమీబియాకు.. న్యూజీలాండ్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యం కష్టతరమైంది. ఓపెనర్లు స్టీఫన్ బార్డ్ (21), మైఖేల్ వాన్ (25) పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గేహార్డ్ ఎరాస్మస్ (3), జేన్ గ్రీన్ (23), డేవిడ్ వైస్ (16) పరుగులకే చేతులెత్తేశారు. ఈ క్రమంలో 102 పరుగులకే నమీబియా 5 కీలక వికెట్లను కోల్పోయింది. అప్పటికే క్రీజులో ఉన్న జేజే స్మిత్ (9 నాటౌట్), రూబెన్(6 నాటౌగ్‌)గా నిలిచినా.. నిర్ణీత ఓవర్లు ముగిశాయి. ఇదిలా ఉంటే 6-7 వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్ నికోల్, క్రెయిగ్ విలియమ్స్ డకౌట్ అయ్యారు. దీంతో 7 వికెట్ల నష్టానికి నమీబియా 111 పరుగులకే పరిమితం అయింది. ఈ క్రమంలో న్యూజీలాండ్ 52 పరుగుల భారీ తేడాతో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక సెమీస్‌ రేసుకు మరింత చేరువైంది.

Next Story

Most Viewed