ఎస్ఐపై సింధు ఫిర్యాదు కేసులో కొత్త ట్విస్ట్

by  |
ఎస్ఐపై సింధు ఫిర్యాదు కేసులో కొత్త ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో ముప్పాళ్ల ఎస్ఐ జగదీశ్‌పై సింధు అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సింధు మొదటి భర్త సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐ జగదీశ్‌తో సింధుకు ఎలాంటి సంబంధం లేదని, ఇదివరకు చాలామంది పేరున్నవారిని సింధు ఇలాగే బెదిరించి డబ్బు వసూలు చేసిందన్నారు. పైసల కోసం సింధు ఎలాంటి పని అయినా చేస్తుందని, ఈ మధ్యకాలంలో మద్యానికి కూడా బానిస అయినట్లు తెలుస్తోందన్నారు. నాకు, సింధుకు 2010లో వివాహం కాగా కుమారుడు, కుమార్తె పుట్టారని చెప్పారు.

సింధు గురించి తెలిసిన వాళ్లను అడిగితే ఎవరైనా చెబుతారని ఇదివరకు చాలామందిని బ్లాక్ మెయిల్ చేసిందన్నారు. 2017లో సింధునే డైవర్స్‌కు అప్లై చేసిందని, తామిద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయామన్నారు. అప్పుడప్పుడు పాపను చూడటానికి వెళ్లినప్పుడు సింధు ఇష్టనుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు. తనకు వారు తెలుసు, వీరు తెలుసంటూ ఇప్పటివరకు చాలామందిని సింధు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిందని సుబ్బారావు అన్నారు. జగదీశ్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని… సింధు మొదటి భర్త సుబ్బారావు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed