ఏపీలో కొత్త కరోనా వైరస్ కలకలం

by  |
ఏపీలో కొత్త కరోనా వైరస్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రిలో కరోనా మహమ్మారి విజృంభణతో, స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కాగా ఆ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఏపీలో మరో కొత్త రకం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది.యూకే నుంచి రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా సోకింది. యూకే నుంచి ఢిల్లీ వచ్చిన ఆ మహిళకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్ లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్ ప్రెస్‌లో రాజమండ్రికి వచ్చింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఆమె ఆచూకీ తెలుసుకొని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె రక్తనమూనాలను సేకరించి, పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో ఆ మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని ఫలితాల వచ్చాక అధికారులు తేల్చనున్నారు.

Next Story

Most Viewed