JusticeForSanjuSamson.. బీసీసీఐపై నెటిజన్ల సంచలన ఆరోపణ

by  |
JusticeForSanjuSamson.. బీసీసీఐపై నెటిజన్ల సంచలన ఆరోపణ
X

దిశ, వెబ్‌డెస్క్: సంజూ శాంసన్.. టీమిండియాలో‌ ఇతడిది ప్రత్యేక స్థానం. ఐపీఎల్‌ సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సంజూ‌కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఈ క్రమంలోనే అనతికాలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. కానీ, టీ20 వరల్డ్‌కప్‌లో బీసీసీఐ సంజూ‌ను ఎంపిక చేయలేదు. ఇక ఈ సిరీస్‌ నుంచి భారత్ నిష్ర్కమించిన అనంతరం న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడనుంది. నవంబర్ 17 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కాగా, మంగళవారం జట్టును ప్రకటించింది టీమిండియా.

ఇందులోనూ సంజూ శాంసన్ పేరు లేకపోవడంతో అతడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదంటూ సంచలన ఆరోపణ చేస్తున్నారు. #JusticeForSanjuSamson అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు పలువురు నెటిజన్లు ఇటీవల జరిగిన శ్రీలంక టూర్‌లో తన ప్రతిభను నిరూపించుకోలేక పోయాడని.. మరోసారి సెలెక్షన్ కమిటీ దృష్టిలో పడేలా ఫోకస్ చేయాలంటూ సూచనలు చేస్తున్నారు.

న్యూజిలాండ్ ‌సిరీస్‌లో విరాట్ కోహ్లీకి రెస్ట్

Next Story

Most Viewed