రాష్ట్రంలో సైకిల్ బోట్లపై నెటిజన్ల ఆసక్తి.. కొనేందుకు తెగ సెర్చింగ్

by  |
Bot
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన నగరాలన్నీ జలమయ్యాయి. అయితే ఈ పరిస్థితిపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని స్మార్ట్ సిటీలు డల్లాస్ నగరాలుగా మారుతున్నాయంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, హైదరాబాద్‌లలో కారు కొనే ముందు రోడ్డు, నీటిపై నడిచే విధంగా వాహనాలు కొందామంటూ కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా మరో వెహికిల్ కొనేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల్లో ఓ వ్యక్తి సైకిల్ బోట్లను నడిపిస్తున్న వీడియోను పెట్టి రాష్ట్రంలో వీటి అవసరం ఎంతో ఉంది అంటూ వైరల్ చేస్తున్నారు. దీనిని కొనేందుకు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మరికొందరు అయితే వరదల్లో మునిగిపోకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు ఎయిర్ ట్యూబ్ ని కట్టుకుంటే మంచిందంటూ ట్వీట్ చేస్తు్న్నారు.

Next Story