భారత్‌కు వ్యతిరేకంగా ‘నేపాలీ నెరజాణ’ ట్వీట్

by  |
భారత్‌కు వ్యతిరేకంగా ‘నేపాలీ నెరజాణ’ ట్వీట్
X

భారత్‌కు మిత్ర దేశమైన నేపాల్.. స్వరం మార్చి కయ్యానికి కాలు దువ్వుతోంది. జమ్మూ, కశ్మీర్ పునర్విభజన తర్వాత భారత్ కొత్త మ్యాప్ విడుదల చేయగా.. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సరిహద్దులోని లిపులేక్, కాలాపానీ, లింపుయధుర ప్రాంతాలు తమ భూభాగాలని, వాటిని ఖచ్చితంగా తిరిగి సాధిస్తామని ఆ దేశ ప్రధాని కేపీ ఓలి ప్రకటించడం అక్కడ చర్చనీయాంశమైంది. ప్రధాని నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ అక్కడి సెలబ్రిటీలు, స్టార్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ లిస్టులో ‘నెల్లూరి నెరజాణ’ మనీషా కోయిరాలా కూడా చేరిపోయింది. బాలీవుడ్‌‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన మనీషా కోయిరాలా ఇప్పుడు భారత్‌పై విమర్శలు చేయడం గమనార్హం.

దీంతో భారత సినీ అభిమానులు, నెటిజన్లు మనీషా కోయిరాలాపై మండిపడుతున్నారు. ఇండియన్ సినిమాలతో ఇమేజ్ పొంది.. ఇండియా మీదే విమర్శలకు దిగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనీషా కోయిరాలా నేపాల్ దేశస్తురాలే కాగా.. తన పూర్వీకులు రాజకీయాల్లోనూ రాణించారు. తన తండ్రి ప్రకాష్ కోయిరాలా, తాత విశ్వేశ్వర ప్రసాద్ కోయిరాలా ఆ దేశ ప్రధానిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అందుకే.. మనీషా తన దేశానికే సపోర్ట్ చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed