కరోనా టైంలో స్టార్స్ బీచ్ లీలలు.. ఇడియట్స్ అంటూ నెటిజన్ల ఫైర్

by  |
కరోనా టైంలో స్టార్స్ బీచ్ లీలలు.. ఇడియట్స్ అంటూ నెటిజన్ల ఫైర్
X

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వెంటిలేటర్లు, బెడ్స్, మందుల కొరతతో పాటు సరైన సమయంలో చికిత్స అందక కొవిడ్‌తో రోగుల ప్రాణాలు పోతున్నాయి. అయితే ఈ టైమ్‌లో సహాయంగా ఉండాల్సిన సెలబ్రిటీలు వెకేషన్‌ అంటూ మాల్దీవ్స్, గోవా చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు. అది పర్సనల్ ఇష్యూ అయినా.. మాల్దీవ్స్‌లో బికినీతో బోల్డ్ పిక్చర్స్, లవర్‌తో కిసింగ్ ఫోటోస్, రొమాంటిక్ ఇమేజెస్ షేర్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాప్ బాలీవుడ్ పీఆర్‌ఓ రోహిణి అయ్యర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీలకు క్లాస్ ఇచ్చింది.

రణ్‌బీర్ కపూర్ -ఆలియా భట్, టైగర్ ష్రాఫ్ – దిశా పఠాని, జాన్వీ కపూర్ అండ్ ఫ్రెండ్స్‌, టీవీ స్టార్స్ చాలా మంది కూడా వెకేషన్‌లో ఉండగా.. సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసి హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఫైర్ అయిన రోహిణీ అయ్యర్.. ఇది మీకు హాలిడే అయినా.. అంతటా కరోనా మహమ్మారితో బాధపడుతున్నారని.. ఈ టైమ్‌లో ఇన్‌సెన్సిటివ్ ఇడియట్స్‌లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారని క్లాస్ పీకింది. స్టార్స్ బ్రెయిన్‌లెస్ కాదు.. పూర్తిగా గుడ్డి, చెవిటి వాళ్లు అయిపోయారని అంది. వీలైతే హెల్ప్ చేయండి లేదంటే కామ్‌గా ఇంట్లో కూర్చోండి.. అదీ సాధ్యం కాకపోతే హాలిడే హోమ్‌లో మాస్క్ వేసుకుని సేదతీరండి తప్ప ఫొటోస్ పోస్ట్ చేసి ఇరిటేట్ చేయొద్దని చెప్పింది. ఇదేమీ ఫ్యాషన్ వీక్ లేదా క్యాలెండర్ ఫొటో షూట్ కాదని గుర్తుంచుకుంటే మంచిదని సూచించింది. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేసిన ఫేమస్ రైటర్ శోభా దే.. మరోసారి బాలీవుడ్ స్టార్స్‌ను కడిగిపారేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed