ఖాకీలపై నెటిజన్లు ఫైర్

by  |
ఖాకీలపై నెటిజన్లు ఫైర్
X

దిశ, మహబూబ్‌నగర్: నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో.. కన్న కొడుకు ముందు తండ్రిని పోలీసులు లాఠీలతో బాదుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన పలువురిని కలిచివేస్తుంది. మా డాడీని కొట్టొద్దు అంకుల్ అని గొంతు చించుకునేలా అరిచిన ఆ పిల్లాడి ఆక్రందనని పట్టించుకోకుండా హృదయవిదారకంగా చితకబాదారు ఖాకీరాయుళ్ళు. చివరకు ఆ తల్లినీ కూడా నోటికొచ్చినట్టు దూషించారు. పిల్లాడి అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులు ఇంత దౌర్జన్యానికి పాల్పడటంతో తక్షణమే సస్పెండ్ చేయాలని సర్వత్రా విమర్షలు వినిపిస్తున్నాయి.

Next Story