- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కామారెడ్డి : ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని, భార్యభర్తలిద్దరితో మాట్లాడదామని అల్లుడి ఇంటికి వచ్చారు అత్తింటివాళ్ళు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలీదు. అల్లుడు ఆదరబాదరగా గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న అల్లుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దేవునిపల్లి గ్రామానికి చెందిన మీసాల రఘువర్ధన్(25)కు బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన రవళితో నాలుగు నెలల కిందట వివాహం జరిగింది.
అయితే, గత కొద్దిరోజులుగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. వీటి వలన ఇంట్లో ఎవరికీ మనఃశాంతి లేకుండా పోయింది. గురువారం అత్తింటివాళ్ళు దేవునిపల్లికి వచ్చారు. అత్తింటివాళ్ళు ఇంట్లో ఉండగానే గదిలోకి వెళ్లిన రఘువర్ధన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ కలహాలే రఘువర్ధన్ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. రఘువర్ధన్ అకాల మరణం ఆ కుటుంబాన్ని కలిచివేసింది. భర్త తన కళ్ల ముందే మృతి చెందడంతో ఆ ఇల్లాలి రోదన అందరినీ కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.