నాచారంలో నేపాలీ గ్యాంగ్ హల్‎చల్

by  |
నాచారంలో నేపాలీ గ్యాంగ్ హల్‎చల్
X

దిశ, వెబ్‎డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారంలో మరో నేపాలీ గ్యాంగ్ హల్‎చల్ సృష్టించింది. ఇంటి యజమానికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంట్లోవారు శుభకార్యానికి వెళ్లగా వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి రూ.10 లక్షలు, 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. అయితే ఈ గ్యాంగ్ 10 రోజుల క్రితమే ఆ ఇంట్లో పనిమనుషులుగా చేరారు. అనంతరం అదును చూసి దోపిడికి పాల్పడి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇలాంటి చోరీ నగరంలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి జరిగింది.

Next Story

Most Viewed