నెమరగోముల ప్రజాప్రతినిధులు సస్పెన్షన్

by  |
నెమరగోముల ప్రజాప్రతినిధులు సస్పెన్షన్
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరగోముల సర్పంచ్ ఆముదాల సుమతి, ఉప సర్పంచ్ ఎర్రబోయిన కృష్ణ, పంచాయతీ సెక్రటరీ జాకీర్​లను తాత్కాలికంగా తొలిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు డీపీవో జగదీశ్ విచారణ చేపట్టారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడం వల్ల పంచాయతీ రాజ్ అధికారుల నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మిగిలిన వార్డు సభ్యుల్లో ఒకరిని సర్పంచ్​గా కలెక్టర్ నామినేట్ చేయనున్నారు. మరొకరిని గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు జాయింట్ చెక్ పవర్ కోసం నియమించే అవకాశం ఉంది.

Next Story

Most Viewed