మళ్లీ మేకప్ వేసుకున్న నీతూ కపూర్

by  |
మళ్లీ మేకప్ వేసుకున్న నీతూ కపూర్
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి హీరోయిన్ నీతూ కపూర్ చాలా ఏళ్ల తర్వాత మేకప్ వేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రిషి కపూర్ మరణంతో ఒంటరి అయిపోయిన తనకు.. పిల్లలిచ్చిన సపోర్ట్‌తో మరోసారి స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమైంది. ‘జగ్ జగ్ జీయో’ సినిమాతో మళ్లీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నానంటున్న నీతు.. సినిమాలోని మ్యాజిక్కే వేరని అంటోంది. అమ్మ, రిషి కపూర్, రణ్‌బీర్ కపూర్ తనతో పాటే ఉన్నట్లు ఫీల్ అవుతున్నానని తెలిపిన ఆమె.. నన్ను నేను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకున్నానని చెప్పింది. సినిమా చేయమని ఎంకరేజ్ చేసిన పిల్లలకు ఈ సందర్భంగా థాంక్స్ చెప్పింది.

‘జగ్ జగ్ జీయో’ షూటింగ్ నిమిత్తం వారం రోజుల క్రితం చంఢీగర్ వెళ్లిన నీతు.. అక్కడే మూవీ యూనిట్‌తో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంది. సోమవారం నుంచి షూటింగ్ ప్రారంభం కాగా, మేకప్ రూమ్ ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. కాగా ఈ సినిమాలో అనిల్ కపూర్, వరుణ్ ధావన్, కియారా అద్వానీ, ప్రజక్తా కోహ్లీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

Next Story