సరిహద్దు సమస్యపై వివరణ ఇవ్వాల్సిందే…..

by  |
సరిహద్దు సమస్యపై వివరణ ఇవ్వాల్సిందే…..
X

ఇండియా, చైనా సరిహద్దు సమస్యపై కేంద్రం పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్ సీపీ నేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. బీజేపీ నేత జువల్ ఓరామ్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో లఢక్ పరిస్థితిపై కేంద్రం వివరణ ఇవ్వాలని కొందరు పట్టుబట్టారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కాగా మరో వైపు సరిహద్దు అంశంపై చర్చించేందుకు ఓ సమావేశాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏర్పాటు చేశారు. దీనికి బిపిన్ రావత్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల చీఫ్‌లు హాజరయ్యారు. వాస్తవాధీన రేఖ(ఎల్ ఏసీ)వద్ద నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు.



Next Story

Most Viewed