మావోయిస్టుల చెరలో జవాన్.. విడుదల అప్పుడే

by  |
మావోయిస్టుల చెరలో జవాన్.. విడుదల అప్పుడే
X

దిశ, భద్రాచలం : మావోయిస్టుల వద్ద ఐదు రోజులుగా బందీగా ఉన్న జవాన్ రాజేశ్వర్ సింగ్ మాన్సాన్ విడుదల కోసం అందరూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అతనికి ఏ హానీ తలబెట్టబోమని, మధ్యవర్తులు వస్తే విడుదల చేస్తామని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిథి వికల్ప్ ప్రకటించడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చారు.‌ అయితే అతని విడుదల ఎపుడనేది ఉత్కంఠగా ఉంది. మావోయిస్టులు తమ చెరలో ఉన్న జవాన్‌ని ఫోటో తీసి బుధవారం విడుదల చేయడంతో అతను ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మీడియా ద్వారా జవాన్‌ని విడుదల చేయించడానికి ఛత్తీస్‌గఢ్ పోలీసులు‌ ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం.‌ నక్సల్స్ వద్ద జవాన్ బందీగా ఉండటంతో బీజాపూర్ – సుక్మా జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు దూకుడు తగ్గించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు సైతం సేఫ్టీ జోన్‌లోకి చేరుకునేంత వరకు జవాన్‌ని బందీగానే ఉంచుకొని ఆ పిమ్మట విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు.


Next Story

Most Viewed