ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు

by  |
ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు
X

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతన్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం నవాబ్‌పేట మండలం ఆర్కతల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా కిష్టయ్య పనిచేస్తున్నారు. ఆరోతరగతి విద్యార్థినికి నీలిచిత్రాలను చూపెడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు విద్యార్థిని విషయం కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిష్టయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కిష్టయ్యకు నేరచరిత్ర ఉందని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. ఓ గ్యాంగ్ రేప్ కేసులో కిష్టయ్య నిందితుడని, 2018లో తోటి ఉద్యోగి కుమారుడికి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని రూ. లక్షలు దండుకుని మోసం చేశాడని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.

Next Story

Most Viewed