శబరిమల ఆలయంలో మహిళలకు నో ఎంట్రీ

by Gantepaka Srikanth |

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) కీలక నిర్ణయం తీసుకుంది.

శబరిమల ఆలయంలో మహిళలకు నో ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం(Sabarimala Temple)లో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలనే తాము సమర్థిస్తున్నామని, మహిళల ప్రవేశంపై పాత ఆచారాలే కొనసాగాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 14లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సోమవారం (మార్చి 2) జరిగిన సమావేశంలో నిర్ణయించారు. గతంలో 2018లో సుప్రీంకోర్టు మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ఇచ్చిన తీర్పును బోర్డు ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. దీనిపై టీడీబీ సభ్యులు మాట్లాడుతూ.. మండలిలో ఈ విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. దేవాలయం యొక్క పవిత్రతను, పురాతన సంప్రదాయాలను కాపాడటమే బోర్డు ప్రాథమిక బాధ్యత. అందుకే మేము సుప్రీంకోర్టులో గత తీర్పును సవాలు చేస్తూ అఫిడవిట్ సమర్పిస్తాము," అని వివరించారు. 2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో పాటు పలు పునఃసమీక్ష పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఈ క్రమంలో టీడీబీ తన పాత వైఖరిని మార్చుకుని, సంప్రదాయాలకే మొగ్గు చూపడం గమనార్హం.

Next Story