తొలి భారతీయ 'అమెరికన్ సెకండ్ లేడీ'.. ఎవరీ ఉష వాన్స్?

by Yella Dhawani Reddy |

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలన ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు స్వీకరించారు.

తొలి భారతీయ అమెరికన్ సెకండ్ లేడీ.. ఎవరీ ఉష వాన్స్?
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలన ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు స్వీకరించారు. జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. తెలుగు మూలాలున్న అతడి భార్య ఆ దేశ సెకండ్ లేడీ హోదాను పొందారు. దీంతో తొలి ఇండియన్-అమెరికన్, హిందూ మహిళగా రికార్డు క్రియేట్ చేసిన జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి ప్రస్తుతం అందరీ దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రమాణ స్వీకార వేడుకల్లో ట్రంప్ సైతం ఆమెపై ప్రశంసలు కురిపించటంతో ఆమె గురించి తెలుసుకునేందుకు అమెరికన్లు సైతం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.

ఉషా చిలుకూరి పూర్వీకులది ఏపీలోని తూ.గో జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు గ్రామం. ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. 1986లో ఉష అమెరికాలోనే జన్మించారు. శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. అనంతరం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు.

యేల్ యూనివర్సిటీలో చదివే సమయంలోనే ఆమెకు జేడీ వాన్స్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారటంతో.. 2014లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జేడీ వాన్స్‌ రాజకీయాల్లో రాణించడం వెనుక ఉష కృషి ఎంతో ఉంది. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు స్వయంగా వెల్లడించారు. కాగా, అతి చిన్న వయసులో అమెరికా 'సెకండ్‌ లేడీ' హోదా సాధించిన వారిలో తెలుగు మూలాలున్న ఉష కూడా ఉండడం మరింత విశేషం.

Next Story