World Bank: భారత్-పాక్ వ్యవహారంలో మాది సహాయక పాత్ర మాత్రమే: ప్రపంచ బ్యాంకు

by S Gopi |
World Bank: భారత్-పాక్ వ్యవహారంలో మాది సహాయక పాత్ర మాత్రమే: ప్రపంచ బ్యాంకు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను 'పరిష్కరిస్తారనే' ఊహాగానాలకు ప్రపంచ బ్యాంకు శుక్రవారం తెరదించింది. దీనికి సంబంధించి తాజాగా ప్రపంచ బ్యాంకు చీఫ్ అజయ్ బంగా స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారత ప్రభుత్వంతో ఈ విషయాన్ని పంచుకుంటూ.. తాజా పరిణామాలపై సహాయకుడి పాత్రకు మించి ఎలాంటి పాత్ర లేదు' అని అన్నారు. ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుని సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై మీడియాలో చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ అదంతా అర్థం లేనిదే. ప్రపంచ బ్యాంకు పాత్ర కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని ' బంగా పేర్కొన్నారు. భారత పర్యటనకు వచ్చిన అజయ్ బంగా, గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన ఒక రోజు తర్వాత ప్రపంచ చీఫ్ అజయ్ బంగా భారత పర్యటన చర్చనీయాంశం అయింది. అయితే, అజయ్ బంగా యూపీలో పెట్టుబడి అవకాశాలపై పరిశీలించేందుకే పర్యటనకు వచ్చారని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, శత్రుదేశం పాక్‌ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కూలిపోయే దశలో ఉన్న పాక్ ఆర్థికవ్యవస్థ్‌ను ఆర్థికంగా మరింత దెబ్బకొట్టేలా ప్రపంచబ్యాంకును ఒప్పించవచ్చే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భారత్, పాక్ విషయంలో ప్రపంచ బ్యాంకు స్పందించింది. అలాగే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంపై మాట్లాడుతుందనే ఊహాగానాలకు చెక్ పెట్టింది. 1960లో సింధు నదీ జలాల పంపిణీపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న భారత్-పాక్ వివాదంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంది. రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేయడానికి సహాయపడింది. గత కొంతకాలంగా, భారత్ సింధు జలాల పంపిణీ విషయంలో అన్యాయం జరుగుతోందని, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలపై పునఃసమీక్ష జరపాలని డిమాండ్ చేస్తోంది.



Next Story

Most Viewed