- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. భారత్లో కండోమ్స్ కొరత!
ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల భారత్ కండోమ్ల తయారీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.

దిశ, వెబ్డెస్క్: పశ్చిమ ఆసియా (Western Asia)లో ఉద్రిక్తతల కారణంగా భారత తయారీ రంగానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇరాన్, పరిసర ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోకెమికల్ (Petrochemical) ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడంతో, దేశంలో కాండమ్ల తయారీ, సప్లయ్ చెయిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కండోమ్స్ తయారీలో ఉపయోగించే లేటెక్స్ ప్రాసెసింగ్కు, అలాగే ప్యాకేజింగ్కు అవసరమైన కొన్ని ప్రత్యేక రకాల పెట్రోకెమికల్స్ ఇరాన్ నుంచి దిగుమతి అవుతాయి. యుద్ధం కారణంగా ఈ దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. సరఫరా తగ్గడంతో ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగాయి. దీంతో తయారీ సంస్థలకు ఉత్పత్తి ఖర్చులు భారమై, మార్కెట్లో కాండమ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఆరోగ్య రంగంపై ప్రభావం..
ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్స్ వినియోగదారు దేశం భారత్. ఒకవేళ వీటి కొరత ఏర్పడితే, అది ప్రభుత్వ కుటుంబ నియంత్రణ పథకాలపై, ఎయిడ్స్ (HIV) కేసులు పెరిగి సురక్షిత లైంగిక సంబంధిత వ్యాధుల నివారణ చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కాండమ్లే కాకుండా, పెట్రోకెమికల్స్ ఆధారంగా తయారయ్యే ఇతర వైద్య పరికరాలు గ్లోవ్స్, సిరంజీలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే, రాబోయే రోజుల్లో ఈ ఉత్పత్తుల కొరత తీవ్రం కావచ్చని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.






