దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన కొడుకు..

by Sujitha Rachapalli |

ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌లోని వికాస్ నగర్‌లో తల్లిని సజీవ దహనం చేశాడు కొడుకు. సురోషో దేవి ఇంట్లో కాలిపోయిన శరీరం, బూడిద అయిపోయిన గృహోపకరణాలు మాత్రమే మిగిలాయి. దీంతో ఆమె భర్త సంజయ్ రాణా

దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన కొడుకు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌లోని వికాస్ నగర్‌లో తల్లిని సజీవ దహనం చేశాడు కొడుకు. సురోషో దేవి ఇంట్లో కాలిపోయిన శరీరం, బూడిద అయిపోయిన గృహోపకరణాలు మాత్రమే మిగిలాయి. దీంతో ఆమె భర్త సంజయ్ రాణా పోలీసులకు సమాచారం అందించాడు. కుమారుడు మన్మోహన్ రాణాపైనే అనుమానం ఉన్నట్లు తెలిపాడు. తన కొడుకు డ్రగ్స్‌కు బానిసయ్యాడని.. ఈ ఘటన జరిగినప్పుడు అతడు మాత్రమే ఇంట్లో ఉన్నాడని చెప్పాడు. ఇంట్లో ఉన్న ముప్పై వేలు కూడా కనిపించకుండా పోయాయని తెలిపాడు. కాగా ప్రస్తుతం కొడుకు తల్లిని సజీవ దహనం చేశాడని అనుమానిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story