- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత్-పాక్ యుద్ధం విషయంలో యూఎస్ యూటర్న్.. మంచిదేగా!

దిశ, నేషనల్ బ్యూరో: ‘భారత్, పాక్ యుద్ధంతో మాకసలు సంబంధం లేదు’ అని చెప్పిన యూఎస్.. ‘రాత్రంతా చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించాం’ అంటూ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. భారత్, పాక్ మధ్య పరిస్థితులు యుద్ధానికి దారితీసేలా కనిపించినప్పటి నుంచి యూఎస్ ఈ విషయంలో కల్పించుకోవాలని చాలామంది కోరారు. అయితే, అది తమ బాధ్యత కాదని యూఎస్ స్పష్టం చేసింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘మాకసలు సంబంధం లేని ఈ యుద్ధంలో తలదూర్చే ఆలోచన మాకు లేదు. ఆయుధాలు వదిలేయాలని భారత్, పాకిస్తాన్కు యూఎస్ చెప్పలేదు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆ రెండు దేశాలకు చెప్పగలం అంతే’ అన్నారు. దీంతో అమెరికా ఇక ఈ విషయంలో కల్పించుకోదని తేలిపోయింది. భారత్పై ద్వేషంతో రగిలిపోయే పాకిస్తాన్.. పరిస్థితిని యుద్ధం వరకు లాక్కెళ్తుందని అంతా అనుకున్నారు.
డ్రోన్లు, మిసైల్స్తో పాకిస్తాన్ దాడులు చేస్తున్న తరుణంలో.. ఇక ఇలాంటి దాడులను యుద్ధచర్యలుగా భావించి, ఎదురుదాడి చేస్తామని భారత్ ప్రకటించింది. దీంతో ఇక యుద్ధం అనివార్యం అని అందరూ అనుకుంటున్న సమయంలో సడెన్గా మళ్లీ యూఎస్ రంగంలోకి దిగింది. ‘రాత్రంతా రెండు దేశాలతో చర్చించి సీజ్ఫైర్కు ఒప్పించాం’ అంటూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా యూటర్న్ తీసుకోవడం మంచిదే అయిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.