సెప్టెంబర్‌లో భారత్‌‌ పర్యటనకు జో బైడెన్..

by Vinod kumar |   (  Updated:2023-08-23 11:18:22  IST  )

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు.

సెప్టెంబర్‌లో భారత్‌‌ పర్యటనకు జో బైడెన్..
X

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు. సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ 20 సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బైడెన్‌ భారత్‌లో నాలుగు రోజుల పాటు ఉంటారని అమెరికా వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 7, 8, 9, 10 తేదీల్లో జీ20 దేశాధినేతల సమావేశాలు జరుగుతాయి. ఈ అన్ని మీటింగ్స్‌కు బైడెన్ హాజరయ్యే ఛాన్స్ ఉంది.

Next Story