- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా షాకింగ్ నిర్ణయం.. పలు భారతీయ కంపెనీలు, వ్యక్తుల వీసాలు రద్దు!
అమెరికా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పలు భారతీయ కంపెనీలు, వ్యక్తుల వీసాలు రద్దు చేసింది. ఫెంటనిల్ రవాణా చేస్తున్న ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్కు చెందిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలకు, వారి కుటుంబాలకు వీసాలు ఇచ్చేందుకు యూఎస్ తిరస్కరించింది. ఇప్పటికే ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. ఈ విషయాన్ని న్యూఢిల్లోని యూఎస్ ఎంబసీ వెల్లడించింది. వీరంతా యూఎస్కు ఫెంటనిల్ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ఎంబసీ ప్రకటించింది. ఫెంటనిల్ అనేది ఒక సింథటిక్ డ్రగ్. గతేడాది యూఎస్లో వేలాది మంది ఫెంటనిల్ ఉపయోగం వల్ల మరణించారు. దీంతో ఫెంటనిల్పై పోరాటం మొదలు పెడతామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలో కొందరు భారత కార్పొరేట్లు, వారి కుటుంబాల వీసాలను రద్దు చేసినట్లు ఎంబసీ పేర్కొంది. అయితే సదరు కంపెనీలు, వ్యక్తుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. తాజా చర్యలతో ఈ కంపెనీలు, వ్యక్తులతోపాటు వారి కుటుం సభ్యులు కూడా యూఎస్ ప్రయాణానికి అనర్హులుగా మారతారని తెలిపింది. అలాగే యూఎస్కు ఫెంటనిల్ రవాణా చేసిన కంపెనీలతో సంబంధం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేస్తే వారిపై కఠినమైన దర్యాప్తు జరుగుతుందని స్పష్టంచేసింది.






