రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయి: కేంద్ర మంత్రి

by velandi.Saikiran |

రానున్న రోజుల్లో చమురు ధరలు అధిక స్థాయిలో ఉండబోవని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గుతాయి: కేంద్ర మంత్రి
X

దిశ‌, వెబ్ డెస్క్: రానున్న రోజుల్లో చమురు ధరలు అధిక స్థాయిలో ఉండబోవని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆయిల్, గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని ఆయన అంచనా వేశారు. మరోవైపు హార్మూజ్ జల సంధి నెల రోజులు మూతపడినా, ఇండియాకు ఎలాంటి ఢోకా లేదని ప్రకటించారు. ఆ జలసంధి క్లోజ్ చేసినా 80 రోజుల పాటు ఇండియా తట్టుకుంటుందని వెల్లడించారు. ఈ మేరకు దేశంలో నిల్వలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధిని దాటేందుకు తాము ఎలాంటి ఫీజు చెల్లించడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story