‘‘కేంద్రమంత్రి గడ్కరీని చంపేస్తాం’’.. కలకలం రేపుతోన్న బెదిరింపు ఫోన్ కాల్

by Disha Web Desk 19 |
‘‘కేంద్రమంత్రి గడ్కరీని చంపేస్తాం’’.. కలకలం రేపుతోన్న బెదిరింపు ఫోన్ కాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని చంపుతామంటూ సోమవారం గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని గడ్కరీ నివాసానికి ఫోన్ చేసిన ఆగంతకుడు కేంద్రమంత్రిని చంపేస్తానంటూ హెచ్చరించాడు. వెంటనే అలర్ట్ అయిన కేంద్రమంత్రి గడ్కరీ కార్యాలయ సిబ్బంది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేంద్రమంత్రి కార్యాలయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఇటీవల సైతం చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని గడ్కరీ ఇంటికి ఫోన్ చేసిన ఆగంతకులు చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే.. మరోసారి కేంద్రమంత్రికి బెదిరింపు కాల్ రావడం హాట్ టాపిక్‌గా మారింది.


Next Story