వాళ్లకు దేశం కంటే కుటుంబమే ముఖ్యం.. కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్

by Dishafeatures2 |
వాళ్లకు దేశం కంటే కుటుంబమే ముఖ్యం.. కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఘటనపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఓ వైపు రైలు ప్రమాద స్థలంలో చేపట్టిన సహాయక చర్యల్లో తమ మంత్రులు తలమునకలై ఉంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశాల్లో ఊరేగుతూ భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు (కాంగ్రెస్) కుటుంబమే అంతా అని.. దేశం గురించి పట్టించుకోరని మండిపడ్డారు. మాట్లాడితే జవాబుదారీతనం అంటారని.. అసలు జవాబుదారీతనం నుంచి పారిపోతోంది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed