రెండు మావోయిస్టు డంప్‌లు స్వాధీనం

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లా పోలీసులు రెండు మావోయిస్టు డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

రెండు మావోయిస్టు డంప్‌లు స్వాధీనం
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లా పోలీసులు రెండు మావోయిస్టు డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు దాచిన నగదు మరియు ఆయుధాలు రెండు వేర్వేరు ప్రదేశాలలో స్వాధీనం చేసుకోగా, ఒక డంప్ నుండి రూ.46 లక్షల 31 వేల 5 వందల రూపాయల నోట్ల కట్టలు లభ్యం అయ్యాయి. రెండో డంప్ నుండి భారీగా ఆయుధాలు, టిఫిన్ బాక్స్ బాంబ్స్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు లభ్యం అయ్యాయి. డంప్‌లో దొరికిన నగదులో పాత 2 వేల నోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు, గరియాబంద్ భద్రతా దళాలు మొత్తం రూ.1 కోటి 8 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాయి.

Next Story