ఒమర్ అబ్దుల్లా vs మోహబూబా ముఫ్తీ.. ఎక్స్‌లో ట్వీట్ల వార్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-16 16:14:25  IST  )

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీల మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఉల్లార్ సరస్సుపై నిర్మించాల్సిన తుల్ బుల్ నేవిగేషన్ బ్యారేజ్ ప్రాజెక్ట్ విషయమై ఇరువురు ట్వీట్లు చేస్తూ.. విమర్శలు గుప్పించుకున్నారు.

ఒమర్ అబ్దుల్లా vs మోహబూబా ముఫ్తీ.. ఎక్స్‌లో ట్వీట్ల వార్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీల మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఉల్లార్ సరస్సుపై నిర్మించాల్సిన తుల్ బుల్ నేవిగేషన్ బ్యారేజ్ ప్రాజెక్ట్ విషయమై ఇరువురు ట్వీట్లు చేస్తూ.. విమర్శలు గుప్పించుకున్నారు. మే15న సీఎం ఒమర్ అబ్దుల్లా ఉత్తర కశ్మీర్లోని వులార్ సరస్సు వద్ద తుల్బుల్ నావిగేషన్ బ్యారేజ్ వద్ద జరుగుతున్న సివిల్ పనుల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 1980ల ప్రారంభంలోనే ఈ బ్యారేజ్ పనులు ప్రారంభమైనా.. పాక్ సింధునదీ జలాల ఒప్పంద ప్రస్తావన తీసుకురావడంతో దానికి బ్రేక్ పడిందని పేర్కొన్నారు. ఈ బ్యారేజ్ పూర్తయితే విద్యుత్ ప్రాజెక్టుల కోసం విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు.

దీనిపై మెహబూబా ముఫ్తీ స్పందించారు. "భారతదేశం - పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాలని జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పిలుపు ఇవ్వడం చాలా దురదృష్టకరం. రెండు దేశాలు పూర్తి స్థాయి యుద్ధం అంచు నుండి వెనక్కి తగ్గిన సమయంలో - జమ్మూ కశ్మీర్లో అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోవడం, విస్తృత విధ్వంసం, అపారమైన బాధల ద్వారా బాధను భరిస్తున్న సమయంలో.. ఇటువంటి ప్రకటనలు బాధ్యతారహితమైనవి, రెచ్చగొట్టేవి అవుతాయి. మన ప్రజలు దేశంలోని మరెవరిలాగే శాంతికి అర్హులు. మన జీవనాడి అయిన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయమే కాకుండా ద్వైపాక్షిక విషయంగా మిగిలిపోవాల్సిన దానిని అంతర్జాతీయీకరించే ప్రమాదం ఉంది." అని ఒమర్ అబ్దుల్లా పోస్ట్ కు రిప్లై ఇచ్చారు.

మెహబూబా పోస్ట్ పై స్పందించిన జమ్మూ సీఎం.. "నిజానికి దురదృష్టకరం ఏమిటంటే, చౌకగా ప్రచారం పొందాలని మరియు సరిహద్దు వెంబడి కూర్చున్న కొంతమందిని సంతోషపెట్టాలన్న గుడ్డి కోరికతో, IWT జమ్మూ & కశ్మీర్ ప్రజల ప్రయోజనాలకు ద్రోహం తలపెట్టాలని చూస్తున్నారు. నేను ఎల్లప్పుడూ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాను. నేను అలాగే కొనసాగిస్తాను. స్పష్టంగా అన్యాయమైన ఒప్పందాన్ని వ్యతిరేకించడం ఏ విధంగానూ, ఆకారంలో, పరిమాణంలో లేదా రూపంలోనూ యుద్ధోన్మాదం కాదు, ఇది జమ్మూ కశ్మీర్ ప్రజలు మన నీటిని మనమే ఉపయోగించుకునే హక్కును నిరాకరించిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడం గురించి." అని చెప్పారు.

"ఎవరిని ఎవరు శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారో కాలమే చెప్తుంది. అయితే.. మీ గౌరవనీయ తాత షేక్ సాహబ్ ఒకప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత రెండు దశాబ్దాలకు పైగా పాకిస్తాన్‌లో విలీనానికి వాదించారని గుర్తుంచుకోవాలి. కానీ ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అకస్మాత్తుగా భారతదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన వైఖరిని మార్చుకున్నారు. దీనికి విరుద్ధంగా తన నమ్మకాలు, నిబద్ధతలను నిలబెట్టుకుంది. మీ పార్టీలా కాకుండా, రాజకీయ అవసరాలకు అనుగుణంగా దాని విధేయతలు నాటకీయంగా మారాయి. మన అంకితభావాన్ని ధృవీకరించడానికి మనం ఉద్రిక్తతలను రేకెత్తించాల్సిన అవసరం లేదు. యుద్ధోన్మాద వాక్చాతుర్యాన్ని అవలంబించాల్సిన అవసరం లేదు. మన చర్యలు వాటి గురించి మాట్లాడుతాయి." మెహబూబా ముఫ్తీ ఒమర్ ను ఉద్దేశించి మరో పోస్ట్ చేశారు.

"నిజంగా మీరు చేయగలిగేది అదేనా? మీరే కాశ్మీర్‌లో అత్యంత ముఖ్యమైన నాయకుడు అని పిలిచే వ్యక్తిపై చౌకబారు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మీరు ఎవరి ప్రయోజనాలను కోరుతున్నారో వారి ప్రయోజనాలను మీరు సమర్థిస్తూనే ఉంటారు. నేను జమ్మూ & కశ్మీరీ ప్రజల ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఉంటాను. మన సొంత నదులను మన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాను. నేను నీటిని ఆపబోను. దానిలో ఎక్కువ భాగాన్ని మనకోసం ఉపయోగించుకుంటాను. ఇప్పుడు నేను కొంత నిజమైన పని చేస్తానని అనుకుంటున్నాను. మీరు ఈ విషయంపై పోస్ట్ చేస్తూనే ఉండవచ్చు." అని సీఎం ఒమర్ అన్నారు. ఇలా ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల మధ్య ఎక్స్ వేదికగా తుల్ బుల్ నేవిగేషన్ బ్యారేజ్ ప్రాజెక్ట్ విషయమై మాటల యుద్ధం జరిగింది.

Next Story