ఆకాశం మధ్యలో ఎయిరిండియా విమానంలో అల్లకల్లోలం.. పలువురికి గాయాలు

by Disha Web Desk 12 |
ఆకాశం మధ్యలో ఎయిరిండియా విమానంలో అల్లకల్లోలం.. పలువురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో మంగళవారం తీవ్ర అల్లకల్లోలం ఏర్పడినట్లు తెలుస్తోంది. కల్లోలం వలన పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారికి విమాన సిబ్బంది చికిత్స అందించారు. అనంతరం విమానం సిడ్నీలో సేఫ్ గా ల్యాండ్ అయింది. అలాగే సిడ్నీ విమానాశ్రయంలో మరికొంతమంది ప్రయాణికులకు చికిత్స అందించారు. అయితే విమానంలో కల్లోలం రేగడం వలను ఎవరు తీవ్రంగా గాయపడలేదని.. ఆస్పత్రిలో కూడా ఎవరూ చేరలేదని విమానాయ సిబ్బంది తెలిపారు.

Next Story

Most Viewed