భారత్ పై ట్రంప్ మరో టారిఫ్ బాంబ్

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి భారత్ కు షాకిచ్చాడు.

భారత్ పై ట్రంప్ మరో టారిఫ్ బాంబ్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి భారత్ కు షాకిచ్చాడు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి భారత్ కు షాకిచ్చాడు.ఇప్పటికే భారత్ ఎగుమతుల(Bharat Exports)పై 25 శాతం సుంకాలు(Taxes) విధించగా.. తాజాగా నేడు మరో టారిఫ్ బాంబ్ పేల్చాడు ట్రంప్. ఇప్పటికే ఉన్న 25 శాతం కాకుండా మరో 25 శాతం అదనపు టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేసారు.

అయితే అదనపు సుంకాలు ఉంటాయని ఇటీవలే ప్రకటించిన ట్రంప్.. దానిని చేసి చూపించారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న కారణంతోనే ఈ అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై మొత్తం 50 శాతం పన్నుల భారం పడనుంది.

Next Story