భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

by Disha Web Desk 2 |
భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఒడిశా రాష్ట్రం కాళహండి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయినట్లు సమాచారం రావటంతో ఇంటెలిజెన్స్ వర్గాలు స్థానిక పోలీసులను అలర్ట్ చేశాయి. ఈ క్రమంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంట్లో ఒక డీఎస్పీకి బుల్లెట్ గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ అభిలాష్ చెప్పారు.

Next Story