- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైల్లో నుంచే జడ్జికి బెదిరింపు మెయిల్
ఓ సైబర్ నేరంలో జైల్లో ఉన్న ఖైదీ.. అక్కడి నుంచి ఏకంగా జడ్జికే బెదిరింపు మెయిల్ చేసాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ సైబర్ నేరంలో జైల్లో ఉన్న ఖైదీ.. అక్కడి నుంచి ఏకంగా జడ్జికే బెదిరింపు మెయిల్ చేసాడు. ఈ ఘటన లఖ్నవూలో చోటు చేసుకోగా.. జాతీయ మీడియాలో సంచలనం రేపుతోంది. సైబర్ నేరం కేసులో నిందితుడిగా ఉన్న అనుభవ్ మిత్తల్.. జైల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ ద్వారా బెదిరింపు ఇ-మెయిల్ పంపినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సుమారు 7 లక్షల మందిని రూ.3,700 కోట్ల మేర మోసం చేసిన అనుభవ్ ప్రస్తుతం లఖ్నవూ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. లఖ్నవూ బెంచ్లోని ఓ న్యాయమూర్తిని హత్య చేయబోతున్నారంటూ అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తికి ఇ-మెయిల్ పంపాడు. పోలీస్ కానిస్టేబుల్ అజయ్ కుమార్ ఫోన్ నుంచి ఆ ఇ-మెయిల్ పంపినట్లు గుర్తించారు సైబర్ సెల్, క్రైమ్ బ్రాంచ్ అధికారులు.
అజయ్ కుమార్ ను, అనుభవ్ ను విచారించగా.. ఆ బెదిరింపు మెయిల్ పంపి... మరో ఖైదీని నేరంలో ఇరికించేందుకు తానే ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. దీనిపై మరింత లోతుగా విచారణ జరిపిస్తామని పేర్కొన్న ఉన్నతాధికారులు.. ఘటనకు కారణం అయిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసారు.






