ఆ వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలి.. పోలీసు కమిషనరేట్ ధర్నా

by Disha Web Desk 9 |
ఆ వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలి.. పోలీసు కమిషనరేట్ ధర్నా
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రస్తుతం మన దేశంలో మహిళలు విద్య, ఉద్యోగ రంగంలో అబ్బాయిల కంటే ముందజంలో రాణిస్తున్నారంటే దానికి కారణం సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే. తాజాగా ఆమెపై కొన్ని వెబ్‌సైట్లు అభ్యంతకర వార్తలు రాతలు రాశాయట. ఈ రాతలను మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా ముంబయి పోలీసు కమిషనరేట్ కార్యాలయం వద్ద ఈ రాతలు రాసిన వెబ్‌సైట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని బుధవారం ధర్నా చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన యోధుల, ధీర వనితల గురించి ఈ విధంగా రాయడం అస్సలు పద్ధతి కాదు, వాళ్లకి వ్యతిరేకంగా కించపరిచేలా రాతలు రాసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హెచ్చరించారు.


Next Story

Most Viewed