సెంట్రల్ జైల్లో ఉగ్రవాదులకు ఫోన్లు సరఫరా.. కోట్ల రూపాయలలో సంపాదన!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-22 17:15:33  IST  )

బెంగళూరు సెంట్రల్ జైలులో సంచలనకరమైన అక్రమ కార్యకలాపం వెలుగులోకి వచ్చింది.

సెంట్రల్ జైల్లో ఉగ్రవాదులకు ఫోన్లు సరఫరా.. కోట్ల రూపాయలలో సంపాదన!
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు సెంట్రల్ జైలులో సంచలనకరమైన అక్రమ కార్యకలాపం వెలుగులోకి వచ్చింది. ఖైదీలకు మానసిక వైద్యం అందించే బాధ్యత కలిగిన డా.ఎస్.నాగరాజు అనే సైకాలజిస్టు, ఉగ్రవాద ఖైదీలకు అక్రమంగా ఫోన్లు సరఫరా చేస్తున్నాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) గుర్తించింది. ఒక్కో ఫోన్‌ను రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య కొనుగోలు చేసి, జైలు లోపల ఉన్న ఖైదీలకు రూ.25,000 నుంచి రూ.30,000కి అమ్ముతూ, సుమారు రూ.1 కోటి వరకు లాభం పొందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్ అనే ఖైదీతో పాటు ఇతర ఖైదీలు కూడా పాలుపంచుకున్నట్లు అధికారులు గుర్తించారు.

డా.నాగరాజు రఘు అనే ఫేక్ పేరుతో ఫోన్లు కొనుగోలు చేసి, జైల్లోకి స్మగ్లింగ్ చేసి సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. రిసార్ట్స్‌కి వెళ్లి అక్కడి నుంచి ఫోన్లు తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. జైలు సిబ్బందిలో కొందరి మద్దతుతోనే ఈ అక్రమాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖైదీలను ఉగ్రవాద దిశగా మళ్లించేందుకు నసీర్ నేతృత్వంలో జరుగుతున్న ప్రణాళికకు ఫోన్ లింక్ మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఫోన్ల సహాయంతో ఖైదీలు బయట ఉన్న ఉగ్రవాద నెట్వర్క్‌తో టచ్‌లో ఉండటం, రిక్రూట్‌మెంట్, ప్రపగండా వంటి కార్యకలాపాలకు ఊతమిచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం డా.నాగరాజుపై కేసు నమోదు చేసి, నిందితులపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన జైళ్ల భద్రత, అధికారుల నైతికతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. జైలు గోడల మధ్యే టెర్రరిజం బలపడే అవకాశం ఉందన్న ఆందోళన కలుగుతోంది. జైళ్లలో భద్రతను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి హైలైట్ చేసింది. మరిన్ని వివరాలు విచారణలో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Next Story