కర్నాటక - మహారాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న వివాదం.. భారీగా చేరుకున్న పోలీసులు

by Disha Web Desk 19 |
కర్నాటక - మహారాష్ట్రాల మధ్య మరోసారి భగ్గుమన్న వివాదం.. భారీగా చేరుకున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర- కర్నాటక రాష్ట్రాల మధ్య మళ్లీ సరిహద్దు వివాదం నెలకొంది. కర్నాటకలో మహారాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యులు పర్యటించడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల వద్ద భారీగా పోలీసు బలగాలు మెహరించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కర్నాటక - మహారాష్ట్ర మధ్య పోలీసులు 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వద్ద వెయ్యి మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed