ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్నే వాడాలి.. ప్రభుత్వం ఆదేశాలు

by Dishafeatures2 |
ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్నే వాడాలి.. ప్రభుత్వం ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి జియో సిమ్ నే వాడాలని గుజరాత్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు వాడుతున్న వోడాఫోన్-ఐడియా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక ఉద్యోగులను నెంబర్లను జియో నెట్ వర్క్ కు మారుస్తున్నట్లు తెలిపింది. రూ.37.50కే పోస్ట్ పెయిడ్ సేవలను అందించనున్నట్లు జియో ప్రకటించింది. ఇక జియోకు మారిన ప్రభుత్వ ఉద్యోగులకు నెలకి 30 జీబీ డేటా 4జీ సర్వీసులతో లభిస్తుంది.

Next Story

Most Viewed