లోయలో పడిన బస్సు.. 10 మంది ప్రయాణికులు మృతి

by Disha Web Desk 2 |
లోయలో పడిన బస్సు.. 10 మంది ప్రయాణికులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed