ప్రధాని నరేంద్రమోదీని కలిసిన టీమిండియా ఉమెన్ ఛాంపియన్స్

by Naga Rani Yarlagadda |

వన్డే ప్రపంచకప్ గెలిచి.. టీమిండియా ఉమెన్ ఛాంపియన్స్ గా నిలిచిన మహిళా జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీని కలిసిన టీమిండియా ఉమెన్ ఛాంపియన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ గెలిచి.. టీమిండియా ఉమెన్ ఛాంపియన్స్ గా నిలిచిన మహిళా జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా టీమ్ మెంబర్స్ అందరినీ ప్రధాని అభినందించారు. మూడు ఓటముల తర్వాత వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చిందన్నారు. జట్టు గెలిచిన ప్రపంచకప్ ను ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆనందంగా తిలకించారు.

కాగా.. టీమిండియా మహిళా జట్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. జట్టులో స్మృతి మంథాన, జెమీమా, రాధ యాదవ్ లకు ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు, ముజుందార్ కు రూ.22.5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. టీమిండియా ఉమెన్స్ జట్టును అభినందిస్తూ.. మహా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story