ముఖేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ భద్రత కల్పించండి.. సుప్రీంకోర్టు

by Dishafeatures2 |
ముఖేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ భద్రత కల్పించండి.. సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దేశంతో పాటు ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు కూడా ఆయనకు, ఆయన కుటుంబానికి ఈ భద్రత అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సెక్యూరిటీ మొత్తానికి అయ్యే ఖర్చును ముఖేశ్ అంబానీ భరించాలని కోర్టు తెలిపింది.

దేశంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం శాఖ, అలాగే విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కేంద్ర హోం శాఖ ముఖేశ్ అంబానీ కుటుంబ భద్రతపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ కృష్ణా మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ తో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.



Next Story