- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టులో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓబీసీ (OBC) జాబితా అప్పీల్ ఉపసంహరణ!
75 ముస్లిం వర్గాల ఓబీసీ గుర్తింపు రద్దుపై కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్లోని ముస్లిం సామాజిక వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్ల కల్పన వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75 ముస్లిం వర్గాలతో కూడిన మొత్తం 77 సామాజిక వర్గాలను ఓబీసీ (OBC) జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన విధానాన్ని రద్దు చేస్తూ మే 2024 లో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు బెంగాల్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
సుప్రీంకోర్టు అనుమతి – అప్పీల్ వెనక్కి
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట మంగళవారం (జూలై 14, 2026) ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి వివరించారు. హైకోర్టు తీర్పుపై తాము దాఖలు చేసిన అప్పీల్ను వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన ధర్మాసనానికి తెలియజేశారు. ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు, అప్పీల్ను ఉపసంహరించుకోవడానికి బెంగాల్ ప్రభుత్వానికి అనుమతినిస్తూ కేసును ముగించింది. దీంతో 77 వర్గాలను ఓబీసీ జాబితా నుంచి తొలగిస్తూ కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు యథాతథంగా అమలు కానుంది.






