గల్వాన్ లోయలో సైనికుల గస్తీ.. గడ్డ కట్టే చలిలో క్రికెట్ ఆడుతూ..

by Disha Web Desk 4 |
గల్వాన్ లోయలో సైనికుల గస్తీ.. గడ్డ కట్టే చలిలో క్రికెట్ ఆడుతూ..
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా ఆర్మీతో జూన్ 2020లో గల్వాన్ లోయలో భారత సైనికులు తలపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ గొడవ జరిగిన ప్రదేశంలోనే చైనా సైనికుల దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ భారత సైనికులు పెట్రోలింగ్ నిర్వహించినట్లు ఓ సైనికాధికారి తెలిపారు. లడఖ్‌లోని లైన్ ఆఫ్ అక్చూవల్ కంట్రోల్ వెంబడి తీసిన వీడియోలో సైనికులు గుర్రాలపై పహారా కాస్తూ కనిపించారు.

ఇండియన్ ఆర్మీ గల్వాన్ లోయలోని గడ్డ కట్టే చలిలో భారత సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫోటోలను ఆర్మీ విడుదల చేసింది. తూర్పు పాంగాంగ్ నది గుండా సైనికులు కవాతు నిర్వహించినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం 2020 నుంచి ఇప్పటి వరకు 50వేల మంది సైనికులను ఎల్ఏసీ గుండా అత్యాధునిక ఆయుధాలతో నియమించినట్లు రష్యాకు చెందిన వార్తా సంస్థ తెలిపింది.



Next Story

Most Viewed