Delhi Liquor Scam : స్కామ్‌లో త్వరలోనే సంచలనాలు.. ఆ నేతల్లో మొదలైన టెన్షన్..!!

by Disha Web Desk 19 |
Delhi Liquor Scam : స్కామ్‌లో త్వరలోనే సంచలనాలు.. ఆ నేతల్లో మొదలైన టెన్షన్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం, ఆధారాలను ఈడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో బేగం పేట్ ఎయిర్ పోర్ట్‌కు లింక్ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రైవేట్ చార్టెర్డ్ విమానాల ద్వారా పెద్ద ఎత్తున నగదు.. ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

అయితే, ఈ డబ్బును తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల అండతోనే తరలించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సూత్ర, పాత్రధారులతో పాటు.. ఈ కేసులో రాజకీయ ప్రముఖల పాత్రపై నిగ్గు తేల్చడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుండి డబ్బు తరలించారనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రస్తుతం బేగం పేట్ ఎయిర్ పోర్ట్‌కు ప్రైవేట్ చార్టెర్డ్ విమానాలు వేళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే ఓ కొలిక్కి రానుండటంతో.. ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన నేతల్లో టెన్షన్ మొదలైంది.


Next Story

Most Viewed