- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోదీ పర్యటన వేళ కలకలం.. సభా వేదిక దగ్గర్లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన వేళ భారీ భద్రతా వైఫల్యం బయటపడింది.

దిశ, వెబ్డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పర్యటనకు కొద్ది గంటల ముందు బెంగళూరు శివార్లలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమ వేదిక సమీపంలో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్ (Gelatin Sticks) లభించడం తీవ్ర కలకలం రేపింది. ఇవాళ బెంగళూరు శివార్లలోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆశ్రమానికి రావాల్సి ఉండగా, ఆయన వెళ్లే మార్గంలోని కగ్గలిపుర సమీపంలో పోలీసులు రెండు జిలెటిన్ స్టిక్స్ను గుర్తించారు. ప్రధాని హాజరయ్యే ప్రధాన వేదికకు సుమారు 3 కి.మీ దూరంలో, ఫుట్పాత్ పక్కన ఓ సంచిలో ఇవి పడి ఉండటాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు గుర్తించారు.
ఈ పేలుడు పదార్థాలు లభించిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (Bomb Disposal Squad), ఫోరెన్సిక్ బృందాలు (Forensic Teams) రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరిపి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ జిలెటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయి..? దీని వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా లేదా భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.






