- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంబాలా ఎయిర్పోర్టు వద్ద భద్రత పెంపు.. ప్రజలకు సీఎం భరోసా

దిశ, వెబ్డెస్క్: భారత్ - పాకిస్థా్న్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు (India - Pakistan War) నెలకొన్న క్రమంలో దేశవ్యాప్తంగా 32 ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంబాలా కంటోన్మెంట్ లోని అంబాలా దేశీయ విమానాశ్రయం సమీపంలో భద్రతను మరింత పెంచారు. పంజాబ్ లోని వివిధ ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులు చేస్తున్న క్రమంలో ముందు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పాకిస్తాన్ దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. గతంలో కూడా పంజాబ్ ముందుండి పోరాడిందన్న ఆయన.. ఈసారి కూడా యుద్ధంగా పంజాబ్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఫిరోజ్ పూర్ ఘటనలో గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్చగా.. మంత్రి చీమా వారిని పరామర్శించినట్లు తెలిపారు. అలాగే క్షిపణులు లభ్యమైన ప్రాంతాల్ని ఆదివారం సందర్శిస్తానని తెలిపారు. పంజాబ్ ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని, అందరినీ సురక్షితంగా ఉంచే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు.