ఆ రెండు రాష్ట్రాల్లో అల్లర్ల వెనుక కుట్ర ఆ పార్టీదే: సంజయ్ రౌత్

by Disha Web Desk 19 |
ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్, బీహార్‌లో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లు, హింసాత్మక ఘటనలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎక్కడైతే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయో ఆ ప్రాంతాల్లోనే అల్లర్లు చెలరేగాయన్నారు. ఈ సందర్భంగా అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత ఆదివారం చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందని చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.



Next Story

Most Viewed