తొలిదశ ఎన్నికల బరిలో ఉన్న ధనవంతులు వీళ్లే..!

by Dishanational6 |
తొలిదశ ఎన్నికల బరిలో ఉన్న ధనవంతులు వీళ్లే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: తొలిదశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్ ఎన్నికల బరిలో ఉన్నవాళ్ల ఆస్తులపై నివేదిక విడుదల చేసింది. వీరిలో 10 మంది తమ ఆస్టులను సున్నాగా ప్రకటించగా.. 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారని తేలింది.

రూ.716 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్‌కు చెందిన నకుల్ నాథ్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడే ఈ నకుల్‌ నాథ్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ లో గెలిచిన ఏకైక సీటు చింద్వారా నియోజకవర్గమే. ఇక, రూ.662 కోట్లు ప్రకటించింన ఏఐఏడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి అశోక్ కుమార్ బరిలో నిలిచారు.

రూ. 304 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కార్తీ చిదంబరం ఉన్నారు. చిదంబరం రూ.96 కోట్లతో నెట్‌వర్త్‌తో జాబితాలో పదో స్థానంలో ఉన్నారు.

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ నుంచి పోటీ చేసిన బీజేపీకి చెందిన మాలా రాజ్యలక్ష్మి షా రూ.206 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. యూపీ సహరానాపూర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ నేత మాజిద్ అలీ రూ.159 కోట్లతోఐదో స్థానంలో ఉన్నారు.

తొలి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో సున్నా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించినవారు 10 మంది ఉన్నారు. వీరిలో తమిళనాడులోని తూత్తుకుడి నుండి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్న పొన్‌రాజ్ కె తన వద్ద రూ. 320 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గం, తమిళనాడులోని చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులు కార్తీక్ గెండ్లాజీ డోక్, సూర్యముత్తులు రూ.500 ఆస్తులను ప్రకటించారు.

Next Story

Most Viewed