- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిపబ్లిక్ డే పరేడ్.. ఆ పక్షుల కోసం చికెన్! ఢిల్లీ ప్రభుత్వం చర్యలు
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే ఎయిర్ షోలో విమానాలకు పక్షుల నుంచి ప్రమాదం తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే ఎయిర్ షోలో విమానాలకు పక్షుల నుంచి ప్రమాదం తలెత్తకుండా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గద్దల వంటి పక్షులు (బ్లాక్ కైట్స్) విమాన మార్గాల్లోకి రాకుండా ఉండేందుకు ఈ సారి 1,275 కిలోల బోన్లెస్ చికెన్ను వినియోగించనుంది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ముందస్తు చర్యల్లో గతంలో బఫెలో మాంసాన్ని ఉపయోగించేవారు. వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈసారి తొలిసారిగా చికెన్ మాంసాన్ని ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు.
జనవరి 15 నుంచి 26 వరకు నగరంలోని 20 ప్రాంతాల్లో, ముఖ్యంగా రెడ్ఫోర్ట్, జామా మసీదు పరిసరాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షులకు ఆహారం అందించడం ద్వారా అవి ఎయిర్ షో మార్గాల నుంచి దూరంగా ఉండేలా చేయడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలు సురక్షితంగా, సాఫీగా సాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.






