ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ ట్రైన్ టికెట్ ధరలు తగ్గింపు!

by Dishafeatures2 |
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ ట్రైన్ టికెట్ ధరలు తగ్గింపు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వందేభారత్ ట్రైన్ టిక్కెట్ ధరలను తగ్గించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ తగ్గింపు అన్ని వందే భారత్ ట్రైన్లలో కాదని, కేవలం కొన్నింటిలో మాత్రమేనని రైల్వే అధికారులు తెలిపారు. ఇండోర్‌-భోపాల్‌, భోపాల్‌-జబల్‌పూర్‌, నాగ్‌పూర్‌-బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి వందే భారత్‌ రైళ్లు ఈ కోవలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ ట్రైన్లలో ఆక్యుపెన్సీ శాతాన్ని పెంచి మరింత మందికి చేరువకావడానికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భోపాల్-జబల్పూర్ వందే భారత్ సర్వీస్ 29 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. ఇండోర్-భోపాల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే కలిగి ఉంది. కాగా ప్రస్తుతం ఏసీ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.950, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్‌కు రూ.1,525 ఖర్చవుతోంది.

Next Story

Most Viewed